S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

11/12/2017 - 04:09

హైదరాబాద్, నవంబర్ 11: ఆంధ్ర,తెలంగాణ రాష్ట్రాల్లోని విద్యుత్ సంస్థలు 2011, 2012 సంవత్సరాల్లో సబ్ ఇంజనీర్లు, లైన్‌మెన్, జూనియర్ లైన్‌మెన్, జూనియర్ అసిస్టెంట్లు, ఇతర పోస్టులకు ఇచ్చిన నోటిఫికేషన్లలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి వచ్చే నాలుగు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు శనివారం ఆదేశించింది.

11/12/2017 - 04:28

అమరావతి, నవంబర్ 11: రాజకీయ సుస్థిరత కోసం తమ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచుకోవాలని భావిస్తోన్న తెలుగు చంద్రులకు ఎప్పటికప్పుడు చుక్కెదురవుతూనే ఉంది. విభజన చట్టం హామీ ప్రకారం ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల్లో సీట్ల సంఖ్యను పెంచాలని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ రాష్ట్ర సీఎం చంద్రశేఖర్‌రావు చాలాకాలం నుంచీ కేంద్రంపై వేర్వేరుగా ఒత్తిడి చేస్తున్నారు.

11/12/2017 - 01:56

జడ్చర్ల, నవంబర్ 11: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం కావేరమ్మపేట దగ్గర 44వ నంబర్ జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం 7 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. హైదరాబాద్ నుండి కర్నూల్ వైపు వెళ్తున్న లారీ కూలీలతో వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ప్రమాదంలో ఆటోడ్రైవర్, ముగ్గురు కూలీలు దుర్మరణం చెందారు.

11/12/2017 - 01:54

హైదరాబాద్, నవంబర్ 11: హైదరాబాద్ ఫార్మా సిటీకి పర్యావరణ అనుమతులకు ఉన్న అవరోధాలు తొలగిపోతున్నాయి. రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాకరంగా చేపట్టిన ఫార్మాసిటీకి సంబంధించి నిర్వహించిన బహిరంగ విచారణలో ప్రజాభిప్రాయం అనుకూలంగా వచ్చినట్లు పరిశ్రమల శాఖ వర్గాలు తెలిపాయి. బహిరంగ విచారణలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది సమర్ధించారు. దీంతో పర్యావరణ అనుమతులు త్వరలోనే కేంద్రం మంజూరు చేసే అవకాశాలు ఉన్నాయి.

11/12/2017 - 01:52

హైదరాబాద్, నవంబర్ 11: మాజీ ఎమ్మెల్యే దేశిని చినమల్లయ్య అనారోగ్యంతో చికిత్స పొందుతూ శనివారం హైదరాబాద్‌లో మృతి చెందారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇందుర్తి నియోజకవర్గం నుంచి నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన మృతి పట్ల సిఎం కెసిఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో తొలినాళ్ల నుంచి చినమల్లయ్య క్రియాశీల పాత్ర పోషించారన్నారు.

11/12/2017 - 01:50

హైదరాబాద్, నవంబర్ 11: తెలంగాణలో ఇప్పుడున్న పాలక, ప్రతిపక్షాలకు ప్రత్యామ్నాయంగా రాజకీయ వేదిక ఏర్పాటు చేయాలని టి.జేఏసీపై వత్తిడి పెరుగుతున్నది. ఈ విషయాన్ని స్వయాన టి.జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ వెల్లడించారు. ప్రొఫెసర్ కోదండరామ్ అధ్వర్యంలో శనివారం జేఏసీ కార్యాలయంలో స్టీరింగ్ కమిటీ సమావేశమై పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది.

11/12/2017 - 01:43

విజయవాడ, నవంబర్ 11: రాష్ట్రంలో భూసమస్యలతో పాటు రికార్డుల్లోని తప్పులను సరిచేసేందుకు చేపట్టిన మీ ఇంటికి మీ భూమి దరఖాస్తులు అధిక సంఖ్యలో తిరస్కరణకు గురవుతున్నాయి. కోర్టు కేసులు, కొంతమంది రెవెన్యూ సిబ్బంది వైఖరి తదితర కారణాలతో దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఈ ఏడాది అక్టోబర్ చివరి నాటికి తిరస్కరణకు గురైన దరఖాస్తుల సంఖ్య దాదాపు 1.29 లక్షలు ఉండటం గమనార్హం.

11/12/2017 - 01:40

విజయవాడ, నవంబర్ 11: కేరళలోని కొచ్చిలో నిర్మించిన కనె్వన్షన్ సెంటర్‌కంటే విశాఖలో నిర్మించనున్న సెంటర్, మాల్ గొప్పగా ఉండాలని లులు గ్రూపు ప్రతినిధులకు సిఎం చంద్రబాబు సూచించారు. కొచ్చిలో అత్యాధునిక వసతి సౌకర్యాలతో లులు గ్రూపు నిర్మించిన కనె్వన్షన్ సెంటర్, మాల్‌లను శనివారం సందర్శించారు.

11/12/2017 - 01:38

విజయవాడ, నవంబర్ 11: ఆర్టీసీలో పదవీ విరమణ వయసు పెంపు విషయం ఎటూ తేలకుండా ఉంది. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు న్యాయస్థానాలు జారీచేసిన ఉత్తర్వులు సైతం బేఖాతరవుతున్నాయి.

11/12/2017 - 01:16

ప్రొద్దుటూరు, నవంబర్ 11: ప్రజల కోసం, ప్రజలు మెచ్చిన, ప్రజల ఆలోచనలతో రూపొందించిన ప్రజా మేనిఫెస్టో తీసుకొస్తామని వైకాపా అధినేత వైఎస్.జగన్మోహన్‌రెడ్డి అన్నారు. ఒక రోజు విరామం తరువాత ప్రజా సంకల్పయాత్ర కడప జిల్లా యర్రగుంట్ల నుంచి శనివారం ప్రారంభమైంది.

Pages