S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/23/2016 - 01:01

హైదరాబాద్, జనవరి 22: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సెగలు అంతిమంగా శుక్రవారం కాంగ్రెస్ ప్రధాన కేంద్రమైన గాంధీ భవన్‌కు తాళం వేయడం వరకూ దారితీశాయి. టికెట్లు దక్కని నేతలు ఆత్మహత్యలు, ఆందోళనలు, ధర్నాలకు గాంధీ భవన్‌నే వేదికగా చేసుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

01/23/2016 - 01:00

హైదరాబాద్, జనవరి 22: వర్శిటీ రీసెర్చ్ స్కాలర్ రోహిత్ ఆత్మహత్యపై కేంద్రం అవాస్తవాలు చెబుతోందని జెడియు పార్లమెంట్ సభ్యులు త్యాగి, పవన్‌కుమార్ ఆరోపించారు. శుక్రవారం వర్శిటీ ప్రాంగణంలో విద్యార్థులు చేపట్టిన నిరాహార దీక్ష శిబిరాన్ని వారు సందర్శించారు. విద్యార్థుల ఆందోళనకు సంఘీభావం తెలిపారు.

01/23/2016 - 00:59

హిందూపురం, జనవరి 22: సెంట్రల్ వర్శిటీకి విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్న నేపధ్యంలో ఇంటెలిజెన్స్ వర్గాలు రంగంలోకి దిగాయి. రోహిత్ విద్యాభ్యాసం చేసిన పాఠశాలలు, కళాశాలలనుంచి పూర్తి వివరాలు సేకరిస్తున్నాయి. ఇందులో భాగంగా అనంతపురం జిల్లా హిందూపురం సమీపంలోని కొడిగెనహళ్లి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గురుకుల కళాశాలలో శుక్రవారం ఇంటెలిజెన్స్ వర్గాలు రోహిత్ వివరాలు సేకరించాయి.

01/23/2016 - 00:59

హైదరాబాద్, జనవరి 22: ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి రోహిత్‌ది ఏ కులమనే విషయమై చర్చలు సాగుతున్న నేపథ్యంలో తమది వడ్డెర కులమేనని అతని తండ్రి తేల్చి చెప్పారు. రోహిత్ తండ్రి మణికుమార్ శుక్రవారం మీడియా ముందుకు వచ్చారు. తాను దళితుడిని కాదని, బిసి ‘ఏ’ గ్రూపునకు చెందిన వాడని ఓ టివి చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

01/23/2016 - 00:58

విజయవాడ (క్రైం), జనవరి 22: కల్తీ మద్యం మరణాల కేసులో అరెస్టయి రిమాండులో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, విజయవాడ నగర అధ్యక్షుడు మల్లాది విష్ణుకు బెయిల్ మంజూరైంది. అయితే బెయిల్ పత్రాలు సకాలంలో జిల్లా జైలుకు చేరనందున విష్ణు విడుదల శనివారానికి వాయిదా పడింది. దీంతో పెద్ద సంఖ్యలో జైలు వద్ద తరలివచ్చిన పార్టీ కార్యకర్తలకు నిరాశే ఎదురైంది.

01/23/2016 - 00:57

హైదరాబాద్, జనవరి 22: మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న అభియోగంపై పోలీసులు నిజాం కళాశాల ప్రొఫెసర్ ఖాసీంను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది. ఆదిలాబాద్‌కు చెందిన మావోయిస్టు కొరియర్ శ్యాంసుందర్‌రెడ్డిని అరెస్టు చేసిన మెదక్ జిల్లా గజ్వేల్ పోలీసులు అతని వద్దనున్న కాల్ డేటా ఆధారంగా ప్రొఫెసర్ ఖాసీంకు కూడా మావోయిస్టు అగ్రనేతలతో సంబంధాలున్నట్టు గుర్తించారు.

01/23/2016 - 00:57

హైదరాబాద్, జనవరి 22: దేశవ్యాప్తంగా రోహిత్ ఆత్మహత్య సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో సెంట్రల్ వర్శిటీ కార్యనిర్వాహక సంఘం శుక్రవారం సమావేశమై పరిస్థితిని సమీక్షించింది. రోహిత్ కుటుంబానికి ఎనిమిది లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించింది. అలాగే చర్చలకు రావలసిందిగా పరిపాలన బాధ్యతలనుంచి తప్పుకున్న అధ్యాపకులను ఆహ్వానించింది. అయితే వారు ఈ ప్రతిపాదనను తిరస్కరించారు.

01/23/2016 - 00:48

హైదరాబాద్, జనవరి 22: హైదరాబాద్‌లో నెలకొల్పె ఫార్పాసిటీ పట్ల జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఆసక్తి చూపుతుండటంతో ఫార్మాసిటీ ఏర్పాటు కోసం త్వరగా సమగ్రమైన నివేదిక తయారు చేయాల్సిందిగా అధికారులను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. దాదాపు 12 వేల ఎకరాల్లో ఫార్మా పరిశ్రమతో పాటు ఫార్మాసిటీ ఏర్పాటు చేయబోతున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు.

01/23/2016 - 00:47

హైదరాబాద్, జనవరి 22: ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న కృషికి ప్రపంచ ఆర్థిక వేదిక మద్దతు తెలిపింది. వ్యవసాయ రంగంలో ఉత్తమ సాగు విధానాల అధ్యయనం, అమలుకు సహకారం అందించేందుకు ఆంధ్రప్రదేశ్‌తో కలిసి పని చేయాలని నిర్ణయించినట్లు స్పష్టం చేసింది. దావోస్ పర్యటనలో ఉన్న చంద్రబాబు ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొన్నారు.

01/23/2016 - 00:46

హైదరాబాద్, జనవరి 22: ఎలాంటి న్యాయ వివాదాలు లేని 8,086 డిఎస్సీ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఎన్నో రోజుల నుంచి డిఎస్సీ కోసం అభ్యర్థులు వేచి చూస్తున్న తరుణంలో న్యాయవివాదాలకు అవకాశం లేకుండా ఫిబ్రవరి మొదటి వారంలో ఎంపికైన అభ్యర్థులకు నియామకపత్రాలను అందజేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

Pages