S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/09/2018 - 01:50

న్యూఢిల్లీ, అక్టోబర్ 8: సికింద్రాబాద్ నుంచి నిజామాబాద్-ముద్కెడ్-ఆదిలాబాద్-నాగ్‌పుర్ మీదుగా నేరుగా ఢిల్లీకి లింక్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించాలని రైల్వేబోర్డు చైర్మన్ అశ్విన్ లోహణికి పార్లమెంట్ సభ్యుడు వినోద్ కుమార్ విజ్ఞప్తి చేశారు. సోమవారం రైల్వేబోర్డు చైర్మన్‌ను కలిసిన ఆయన ఒక వినతిపత్రాన్ని సమర్పించారు.

10/09/2018 - 01:40

అహ్మదాబాద్, అక్టోబర్ 8: రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొందని, ఎవరూ భయపడాల్సిన పనిలేదని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ విజ్ఞప్తి చేశారు. అలాగే ఎవరూ వలసవాదులెవరూ రాష్ట్రం విడిచి వెళ్లవద్దనని ఆయన కోరారు. అత్యాచారం ఘటన నేపథ్యంలో దాడులు జరడంతో భయపడ్డ బిహారీ వలసవాదులు సొంత రాష్ట్రానికి వెళ్లిపోయారు.

10/09/2018 - 01:33

బెంగళూరు, అక్టోబర్ 8: వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ కర్నాటక నుంచి పోటీ చేస్తారని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత యడ్యూరప్ప స్పష్టం చేశారు. నవంబర్‌లో జరిగే మూడు లోక్‌సభ, రెండు అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక బుధవారం జరిగే పార్టీ కోర్‌కమిటీలో నిర్ణయిస్తామని ఆయన చెప్పారు.

10/09/2018 - 01:31

తిరువనంతపురం, అక్టోబర్ 8: శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల ఆడవాళ్లూ ప్రవేశంచవచ్చన్న సుప్రీం కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ పోరాటాలు చేసేవారిపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సోమవారం నాడు విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ తీరుతోనే సమస్య జటిలం అవుతోందని కాంగ్రెస్ నేత రమేష్‌చెన్నితల ఆరోపించారు. ఈ వివాదం అత్యంత బాధాకరమని ట్రావన్‌కోర్ రాజకుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది.

10/09/2018 - 01:29

జైపూర్, అక్టోబర్ 8: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నిక ప్రచారం ఈసారి కొత్త పుంతలు తొక్కనుంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్ నుంచి ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. డిసెంబర్ 7న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. హోరాహోరీ యుద్ధంలో సామాజిక మాద్యమాలను సద్వినియోగం చేసుకోవాలని ఈ పాటికే నిర్ణయానికి వచ్చారు.

10/09/2018 - 01:28

డామన్ (మధ్యప్రదేశ్) అక్టోబర్ 8: మధ్యప్రదేశ్ రాష్ట్రం డామన్ జిల్లాలో ఎన్నికల నియమావళి ఉల్లఘనపై అధికారులు కొరడా ఝళిపించారు. ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి జయంత్ మాలయ్యా చిత్రాలు ముంద్రించిన రెండు వేల సంచులను అధికారులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కమిషన్ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన నేపథ్యంలో గత శనివారం నుంచి మధ్యప్రదేశ్‌లో ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చింది.

10/09/2018 - 01:26

ముంబయి, అక్టోబర్ 8: బాలీవుడ్ పాతతరం నటుడు దిలీప్‌కుమార్ అస్వస్థతతో నగరంలోని ఓ ఆసుపత్రిలో చేరారు. 95 దిలీప్‌కుమార్ న్యుమేనియాతో బాధపడుతున్నారు. ఆదివారం రాత్రి కుమార్‌ను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్టు ఆయన కుటుంబానికి సన్నిహితుడైన ఫైజల్ ఫరూఖీ వెల్లడించారు.‘బాలీవుడ్ నట దిగ్గజం న్యుమేనియాతో బాధపడుతున్నారు. ఆయనకు వైద్య సేవలందిస్తున్నారు.

10/09/2018 - 01:09

న్యూఢిల్లీ, ఇంచెన్ (సౌత్ కొరియా, అక్టోబర్ 8: రోజురోజుకు ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో సంభవిస్తున్న పెనుమార్పులు అందరినీ కలవరపరుస్తోంది. ముఖ్యంగా భూగోళంపై పెరుగుతున్న తాపం ఆందోళన కలిగిస్తోంది.

10/09/2018 - 01:08

న్యూఢిల్లీ, అక్టోబర్ 8: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలపై 14 జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీల ఐక్య యువజన ఫ్రంట్ సోమవారం ఢిల్లీలో నిరసన ప్రదర్శన నిర్వహించింది. నిరుద్యోగం,ద్రవ్యోల్బణం, పెట్రోధరలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పార్లమెంటు వరకు పెద్దయెత్తున ర్యాలీ జరిగింది.

10/09/2018 - 01:04

న్యూఢిల్లీ, అక్టోబర్ 8: చిన్నపిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించి కేసు నమోదుకు ఇప్పుడు ఉన్న వయోపరిమితి నిబంధనను ఎత్తివేయాలని కేంద్ర న్యాయశాఖ మంత్రికి కేంద్ర స్ర్తి, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ విజ్ఞప్తి చేశారు. సమాజంలో హింస, చిన్నపిల్లలు, మహిళలపై అకృత్యాలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇవి ఎన్నటికీ పూర్తిగా నిర్మూలించలేమని అన్నారు.

Pages