S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/13/2017 - 03:42

తిమ్మాపూర్, డిసెంబర్ 12: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రాజీవ్ రహదారిపై రేణికుంట గ్రామ శివారులోగల టోల్‌ప్లాజా వద్ద మంగళవారం ఉదయం చొప్పదండి ఎమ్మెల్యే బొడిగ శోభ, ఆమె భర్త గాలయ్యతోపాటు గన్‌మెన్‌లు వీరంగం సృష్టించారు. ఈ వీరంగంపై తీసిన వీడియో దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో సంచలనం రేపుతోంది. దాడికి గురైన సిబ్బంది పంబాల రాజు, జీవన్ కథనం ప్రకారం...

12/13/2017 - 03:41

సిరిసిల్ల, డిసెంబర్ 12: తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఇంటికో ఉద్యోగమని చెప్పిన కేసీఆర్ రాష్ట్రం సాధించుకున్నాక కనీసం ఊరికో ఉద్యోగం కూడా లేదని, రైతుల్లాగే నిరుద్యోతీ యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఆది శ్రీనివాస్ ఆరోపించారు.

12/13/2017 - 02:27

హైదరాబాద్, డిసెంబర్ 12: అద్దె గర్భం కేసులకు సంబంధించిన అంశాలపై పరిశీలనకు ప్రభుత్వం రెండు కమిటీలను నియమించింది. గతంలో ఇందుకు సంబంధించి ప్రభుత్వం నియమించిన కమిటీలలో స్వల్పమార్పులు, చేర్పులు చేశారు. సరోగసి కమిటీకి చైర్మన్‌గా జస్టిస్ గోపాల్‌రెడ్డి (రిటైర్డ్ జడ్జి) ని నియమించారు.

12/13/2017 - 02:26

హైదరాబాద్, డిసెంబర్ 12: తెలంగాణవ్యాప్తంగా టీఎస్‌ఆర్టీసీ ఎంప్లారుూస్ యూనియన్ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టింది. మంగళవారం రాష్ట్రంలోని అన్ని డిపోల ముందు కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి తమ నిరసన, ధర్నా నిర్వహించారు. గుర్తింపు పొందిన టీఎంయూ యాజమాన్యానికి వత్తాసు పలుకుతూ కార్మికుల హక్కులను కాలరాస్తుందని ఆరోపించారు.

12/13/2017 - 02:26

హైదరాబాద్, డిసెంబర్ 12: తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిని 36 మంది విదేశీ విద్యార్థులు సందర్శించి అధ్యయనం చేశారు. స్వీడన్, శ్రీలంక, సోమాలియ, ఉగండాకు చెందిన విద్యార్థులు మంగళవారం సనత్‌నగర్‌లోని కాలుష్య నియంత్రణ మండలి ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారని ఆ సంస్థ ఫ్యాకల్టీ సభ్యుడు డాక్టర్ విశే్వశ్వర్ రెడ్డి తెలిపారు.

12/13/2017 - 02:25

హైదరాబాద్, డిసెంబర్ 12: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఉద్యోగ ప్రకటనల దిక్కే లేదని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్ వి సుభాష్ ఆరోపించారు. మంగళవారం నాడు ఆయన పార్టీ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ ఎపిలో రెండు డిఎస్సీలు విడుదల చేశారని అన్నారు. ఉద్యోగాలు లేక యువత, నిరుద్యోగులు అయోమయంలో పడ్డారని, నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు.

12/13/2017 - 02:25

హైదరాబాద్, డిసెంబర్ 12: తెలుగు భాషను పరిరక్షించిన టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టి రామారావును మరిచి ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తారా? అని టి.టిడిపి సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు సాయిబాబా ప్రశ్నించారు. 1988 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌కు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చారిత్రాత్మకమైన 587 జివోను ప్రవేశపెట్టారని ఆయన అన్నారు.

12/13/2017 - 02:24

హైదరాబాద్, డిసెంబర్ 12: రాష్ట్రంలో 2015-16, 2016-17 సంవత్సరాలకు సంబంధించి పం టల బీమా సొమ్ము మొత్తాన్ని వారంరోజుల్లోగా చెల్లించాలని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. వ్యవసాయ, బీమా శాఖల అధికారులతో మంగళవారం ఆయన సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.

12/13/2017 - 02:23

హైదరాబాద్, డిసెంబర్ 12: తెలంగాణ మట్టిలోనే తిరుగుబాటు తత్వం ఉందని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. టెక్కం జనార్దన్ రాసిన పండగ సాయన్న పుస్తకాన్ని మంత్రి ఈటల మంగళవారం తన ఛాంబర్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్యాయాలను, అక్రమాలను ఎదిరించే వారసత్వం తెలంగాణ ప్రజలకు ఉందన్నారు. 19వ శతాబ్దంలో మహబూబ్‌నగరణలో అతి సామాన్య కుటుంబంలో పండగ సాయన్న జన్మించారని చెప్పారు.

12/13/2017 - 02:23

హైదరాబాద్, డిసెంబర్ 12: ప్రపంచ మహా సభల పేరిట రాష్ట్ర ప్రభుత్వం మరో ఈవెంట్‌కు హైదరాబాద్‌ను వేదిక చేసిందని, ప్రభుత్వం పాలన చేయడం మానేసి ఈవెంట్ మేనేజ్‌మెంట్ చేస్తున్నదని టి.పిసిసి ప్రధాన కార్యదర్శి డాక్టర్ దాసోజు శ్రవణ్ విమర్శించారు. రూ.50 కోట్ల ప్రజాధనంతో ప్రపంచ మహా సభలు నిర్వహిస్తారా? అని ఆయన మంగళవారం విలేఖరుల సమావేశంలో ప్రశ్నించారు.

Pages